అమరావతి : క్రికెట్ బెట్టింగ్కు పాల్పడుతున్న ఐదుగురివ్యక్తులను తూర్పు గోదావరి జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. వీరిలో ఒకరు టీడీపీ నేతగా పనిచేస్తున్నారు. జిల్లాలోని అనపర్తి మండలం రామవరంలో క్రికెట్ బెట్టింగ్ జోరుగా జరుగుతుందన్న సమాచారం మేరకు పోలీసులు వ్యూహం ప్రకారం బెట్టింగ్ శిబిరంపై మూకుమ్మడిగా దాడి చేసి ఐదుగురిని అరెస్టు చేశారు.
వీరి వద్ద నుంచి రూ. 2. 5 లక్షలు, లాప్టాప్, అకౌంట్స్ బుక్ సీజ్ చేశారు. గత నెలలో ఐపీఎల్ ప్రారంభం నుంచి ఇప్పటి వరకు రూ. 52 లక్షలు బెట్టింగ్కు పాల్పడ్డారని పోలీసులు తెలిపారు. కాగా అరెస్టు అయిన వారిలో రాష్ట్ర తెలుగు యువత అధికార ప్రతినిధి సత్య కూడా ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.