అమరావతి : ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ టీడీపీ నాయకుడు బొండా ఉమపై ఫైర్ అయ్యారు. రాజకీయ పబ్బం గడుపుకోవడానికి ఉమ ఇష్టానుసారం మాట్లాడుతున్నారని ఆమె మండిపడ్డారు. విజయవాడ అత్యాచార బాధితురాలి అంశంపై టీడీపీ రాజకీయం చేస్తోందని ఆరోపించారు. ఘటన జరిగిన సమాచారం తెలియగానే చర్యలకు కమిషన్ ఉపక్రమించిందని ఆమె తెలిపారు. మూడేళ్లుగా ప్రతికేసును మహిళా కమిషన్ పరిశీలిస్తోందని అన్నారు.
మహిళలను అగౌరవపరిచే విధంగా మాట్లాడుతున్నారని అన్నారు. తమకు పబ్లిసిటి పిచ్చి లేదని స్పష్టం చేశారు. ఇష్టానుసారంగా మాట్లాడితే బొండా ఉమకు ముందుంది ముసళ్ల పండుగని, మహిళలే ఆయనకు తగిన విధంగా బుద్ధి చెబుతారని హెచ్చరించారు. తనపై వ్యక్తిగత మాట్లాడిన మాటాలు మహిళా లోకానికే అవమానమని అన్నారు. టీడీపీ హయాంలో మహిళలపై జరిగిన దాడులపై అప్పటి నాయకులు స్పందించలేదని పేర్కొన్నారు.