అమరావతి : ఆంధ్రప్రదేశ్లో గడిచిన మూడేళ్లలో జరిగిన ప్రతీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓడిపోయి ప్రస్తుతం వెంటిలేటర్ పై ఉందని ఏపీ ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. ఎన్నికల్లో గెలవడానికి అడ్డదారులు ఉండవని అన్నారు. ప్రతి ఎన్నికల్లో ఎవరో ఒకరి తోడులేనిదే టీడీపీ ఎన్నికల్లో పాల్గొనలేదని ఆరోపించారు.
వచ్చే ఎన్నికల్లో తామే గెలుస్తామని భ్రమల్లో టీడీపీ ఉందని ఎద్దేవా చేశారు. నిన్న ఢిల్లీలో ప్రధాని మోదీని కలిసిన చంద్రబాబు ఏదోదో ప్రచారం చేసుకుంటున్నారని విమర్శించారు. చంద్రబాబు ఏపీలో చేసింది, చెప్పుకోదగ్గ కార్యక్రమాలు ఏవీ లేవని అన్నారు. వైసీపీ పార్టీ చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు స్పష్టంగా ఉన్నాయని,నీతి నిజాయితీగా, పారదర్శకంగా ప్రజలకు అందుతున్నాయని అన్నారు. రాష్ట్రాన్ని పురోభివృద్ధి దిశలో కొనసాగిస్తున్నామని పేర్కొన్నారు.