అమరావతి : ఏపీలో తెలుగుదేశం (TDP ) పార్టీ అభ్యర్థుల జాబితాను పూర్తి చేసింది. పెండింగ్లో పెట్టిన నలుగురు ఎంపీ(Loksabha), 9 మంది అసెంబ్లీ (Assembly) అభ్యర్థులతో తుదిజాబితాను విడుదల చేసింది. విజయనగరం టీడీపీ ఎంపీ అభ్యర్థిగా అప్పలనాయుడు(Appalanaidu) , ఒంగోలు టీడీపీ ఎంపీ అభ్యర్థిగా మాగుంట శ్రీనివాసుల రెడ్డి, అనంతపురం ఎంపీ అభ్యర్థిగా అంబికా లక్ష్మినారాయణ, కడప ఎంపీ అభ్యర్థిగా చదిపిరాళ్ల భూపేశ్రెడ్డి పేర్లను చంద్రబాబు (Chandra Babu), శుక్రవారం ప్రకటించారు.
చీపురుపల్లి అసెంబ్లీ అభ్యర్థిగా కళా వెంకట్రావు, భీమిలి నుంచి గంటా శ్రీనివాసరావు, పాడేరులో వెంకటరమేశ్ నాయుడు, దర్శి గొట్టిపాటి లక్ష్మి, రాజంపేట నుంచి సుగవాసి సుబ్రహ్మణ్యం, ఆలూరు నుంచి వీరభద్ర గౌడ్, గుంతకల్లు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా గుమ్మనూరు జయరామ్ పేర్లను ప్రకటించారు. అనంతపురం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా దగ్గుపాటి వేంకటేశ్వర ప్రసాద్, కదిరి అభ్యర్థిని సర్దుబాటు చేశారు. ఇదివరకు కందికుంట యశోదకు బదులుగా కందికుంట ప్రసాద్కు కదిరి టికెట్ను ఇచ్చారు.