టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, సీపీఐ సీనియర్ నేత నారాయణ మధ్య సరదా సంభాషణ జరిగింది. హైదరాబాదులోని హోటల్ దసపల్లా ఇందుకు వేదికైంది. టీడీపీ సీనియర్ నేత, రాజ్యసభ మాజీ సభ్యుడు కంభంపాటి రామ్మోహన్ రావు నేను- తెలుగుదేశం అనే పుస్తకాన్ని రచించారు. ఈ పుస్తకావిష్కరణ హోటల్ దసపల్లాలో జరిగింది. ఈ కార్యక్రమానికి టీడీపీ అధినేత చంద్రబాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సీపీఐ నేత నారాయణ, ఇతర పార్టీ నేతలు, టీడీపీ సీనియర్ నేతలు అందరూ హాజరయ్యారు.
ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ… సీపీఐ నారాయణ కూడా నేను- తెలుగుదేశం అంటూ ఓ పుస్తకం రాయవచ్చంటూ జోకులు చేశారు. ఒకవిధంగా ఆలోచిస్తే.. నారాయణ వేరే పార్టీలో ఉన్నా.. తెలుగుదేశంతో అలయెన్స్ పెట్టుకొని.. అనేక లాభాలు పొందారు. విభేదించారు. విమర్శించారు. మీరు కూడా ఓ బుక్ రాయవచ్చు నేను- తెలుగుదేశం అని అని చంద్రబాబు అన్నారు. తనకు, సీపీఐ నారాయణకు ఓ వ్యత్యాసం ఉందని, నారాయణ సిద్ధాంతం కోసం పనిచేస్తే, తాము ప్రజల కోసం పనిచేస్తామని చంద్రబాబు అన్నారు.