TDP-BJP Alliance | హైదరాబాద్, మార్చి 8 (నమస్తే తెలంగాణ): ఏపీ రాజకీయాలు మరో కీలక మ లుపు తీసుకుంటున్నాయి. దాదాపు ఆరేండ్ల తరువాత టీడీపీ అధినేత చంద్రబాబు బీజేపీతో ఎన్నికల పొత్తు కుదుర్చుకున్నారు. ఏపీలో త్వరలో జరుగనున్న అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ, జనసేన కలిసి పనిచేయాలని నిర్ణయించామని తెలుగుదేశం పార్టీ ఏపీ అధ్యక్షుడు కే అచ్చెన్నాయు డు శుక్రవారం వెల్లడించారు. ఈ మేరకు ఢిల్లీలో మూడు పార్టీల మధ్య సీట్ల సర్దుబా టు చర్చలు జరుగుతున్నాయని తెలిపారు.
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో చంద్రబాబు, పవన్కల్యాణ్ చర్చలు జరిపారు. పొత్తుల్లో ఆ పార్టీలు అవగాహనకు వచ్చా యి. బీజేపీ, జనసేన పార్టీలకు 30 అసెంబ్లీ, 8 లోక్సభ స్థానాలు ఇచ్చేందుకు టీడీపీ అంగీకరించింది. మిగతాచోట్ల టీడీపీ పోటీ చేసేలా అంగీకారం కుదిరినట్టు సమాచారం. బీజేపీ ఐదు, జనసేన మూడు సీట్ల లో పోటీ చేయనున్నట్టు తెలిసింది. అరకు, రాజమండ్రి, నరసాపురం, తిరుపతి, రాజంపేట స్థానాల్లో బీజేపీ.. అనకాపల్లి, కాకినాడ, మచిలీపట్నం సీట్లలో జనసేన పోటీచేయనున్నట్టు సమాచారం.