అమరావతి : ఏపీలో తెలుగుదేశం పార్టీ గురించి మాట్లాడడం వృథా అని ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యనించారు. వైసీపీ ప్లీనరీ సమావేశాల సందర్భంగా విజయనగరం జిల్లా చీపురపల్లి నియోజకవర్గంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. టీడీపీకి చెందిన నాయకులు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని ఆరోపించారు.
గత ఎన్నికల్లో అధికారంలోకి రావడానికి చంద్రబాబు పెద్ద ఎత్తున డబ్బులు పంపిణీ చేసినా ఓటర్లు బుద్ధి చెప్పారని అన్నారు. వైసీపీ నాయకులు, కార్యకర్తలు గ్రామాల్లో నియంతలా వ్యవహరించ వద్దని సూచించారు. మనస్పర్థాలను పక్కన బెట్టి పార్టీ శ్రేయస్సు కోసం అహర్నిశలు కృషి చేయాలని హితవు పలికారు. ఎప్పుడు తానే నాయకుడని మురిసిపోవద్దని పేర్కొన్నారు. గ్రామస్థాయి నాయకులు లంచాలడిగితే పార్టీకి నష్టం వస్తుందని తెలిపారు.