తిరుమల : తిరుపతికి చెందిన త్రివేణ్ కుమార్ అనే భక్తుడు శ్రీ వేంకటేశ్వర అన్నప్రసాదం ట్రస్టుకు రూ.10 లక్షలు విరాళంగా అందజేశారు. తిరుమల అన్నమయ్య భవనంలో విరాళం డీడీని టీటీడీ చైర్మన్ వై.వి.సుబ్బారెడ్డికి, బోర్డ్ సభ్యులు కాటసాని రాంభూపాల్ రెడ్డి చేతుల మీదుగా అందజేశారు.
ప్రొద్దుటూరుకు చెందిన తిరుపాలయ్య, రమేష్బాబు, లక్ష్మీ నారాయణ అనే భక్తులు వేంకటేశ్వర అన్నప్రసాదం ట్రస్టు, శ్రీ పద్మావతి చిన్నపిల్లల గుండె చికిత్సల ఆసుపత్రికి రూ.30 లక్షలు రూపాయలు విరాళంగా అందించారు.విరాళం డీడీని తిరుమలలో ఈవో క్యాంపు కార్యాలయంలో ఈవో డాక్టర్ కె.ఎస్.జవహర్ రెడ్డికి అందజేశారు.