అమరావతి: భార్యమృతి చెందగా, రాత్రికిరాత్రే భర్త ఆమె దహన సంస్కారాలు పూర్తి చేసేశాడు. దీంతో ఆమె మృతి అనుమానస్పదంగా మారింది. కడపజిల్లా బ్రహ్మంగారిమఠం మండలంలోని నేలటూరులో గ్రామంలో దారుణం జరిగింది. నాగలక్ష్మీ అనే వివాహిత అనుమానస్పదంగా శుక్రవారం రాత్రి మృతి చెందింది. అయితే రాత్రికిరాత్రే..భర్త సుబ్బారెడ్డి,బంధువులు తెల్లవారేసరికి నాగలక్ష్మీ దహన సంస్కారాలు పూర్తి చేశారు. మహిళ మృతికి కుటుంబ కలహాలే కారణమని స్థానికులు చెబుతున్నారు.
విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. రాత్రికిరాత్రే దహన సంస్కారాలు చేయడంపై పోలీసులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దీంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.