అమరావతి : ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైనప్పటి నుంచి టీడీపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్ కొనసాగు తుంది. ఇవాళ కూడా అసెంబ్లీ సమావేశాల మూడోరోజూ తమకు చర్చకు అవకాశమివ్వాలని టీడీపీ సభ్యులు పట్టుబట్టారు. రైతుల సమస్యలపై చర్చకు అవకాశమివ్వాలని, రైతు ద్రోహి జగన్ అంటూ నినాదాలు చేస్తూ పోడియంను ముట్టడించారు.
మరోవైపు చంద్రబాబు 420 అంటూ మరోవైపు వైసీపీ ఎమ్మెల్యేలు నినాదాలు చేశారు. ప్రశ్నోత్తారాలు జరుగకుండా ఆటంకం కలుగుతుండడంతో సభ్యుల సస్పెన్షన్కు రాష్ట్రవ్యవహారాల మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ సిఫార్సు చేయడంతో ఈ మేరకు సభా అధ్యక్ష స్థానంలో ఉన్న స్పీకర్ తమ్మినేని సీతారాం టీడీపీ ఎమ్మెల్యేలను ఒకరోజు సస్పెన్షన్ చేశారు.