అమరావతి : నెల్లూరు జిల్లా(Nellore District) లో విషాదం చోటు చేసుకుంది. అప్పటి వరకు మేళతాళాలు, బంధువుల సందడితో కళకళలాడిన ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. పెళ్లైన 11 రోజులకే విద్యుదాఘాతంతో మృత్యువాతపడడం రెండు కుటుంబాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి.
జిల్లాలోని అనంతసాగరం మండలం లక్కరాజుపల్లిలో కామిరెడ్డిపాడు సచివాలయ సర్వేయర్ (Surveyor ) విష్ణువర్ధన్రెడ్డి పనిచేస్తున్నాడు. ఇతడికి 11 రోజుల క్రితమే వివాహం జరిగింది. ఆదివారం గ్రామానికి చెందిన ఓ రైతు పొలంలో మోటారు మరమ్మతు చేస్తుండగా ఒక్కసారిగా కరెంట్ షాక్(Electrocution) తో ఘటనా స్థలంలోనే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న రెండు కుటుంబాల సభ్యులు ఘటనాస్థలానికి చేరుకుని బోరున విలపించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.