న్యూఢిల్లీ: ఫైబర్నెట్ కేసులో (Fibernet case) ముందస్తు బెయిల్కు పిటిషన్ వేసిన టీడీపీ అధినేత చంద్రబాబుకు (Chandrababu) మరోసారి నిరాశే ఎదురయింది. బెయిల్ పిటిషన్పై విచారణను వచ్చే నెల 8వ తేదీకి సుప్రీంకోర్టు వాయిదా వేసింది. ముందుగా స్కిల్ డెవల్ప్మెంట్ కేసులో తీర్పు వెలువరిస్తామని, అనంతరం ఫైబర్ నెట్ కేసు అంశాన్ని పరిగణనలోకి తీసుకుంటామని స్పష్టం చేసింది. అప్పటివరకు చంద్రబాబును అరెస్టు చేయొద్దని, పీటీ వారెంట్పై యథాతథ స్థితి కొనసాగించాలని ఆదేశించింది.
ముందస్తు బెయిల్పై జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బేలా ఎం. త్రివేది ధర్మాసనం ముందు చంద్రబాబు తరఫున సీనియర్ న్యాయవాది సిద్ధార్ధ లూథ్రా వాదనలు వినిపించారు. ఫైబర్నెట్ కేసులో తన ముందస్తు బెయిల్ పిటిన్ను ఏపీ హైకోర్టు ఈ నెల 9న ఇచ్చిన తీర్పును చంద్రబాబు సుప్రీకోర్టులో సవాల్ చేసిన విషయం తెలిసిందే.