అమరావతి: కరోనా బాధితులకు పరిహారం ఇవ్వని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీరుపై సుప్రీం కోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని హాజరుకావాలంటూ ఆదేశాలిచ్చింది. కోవిడ్ బాధితుల పరిహారాన్నివారి బంధువులకు ఏపీ, బీహార్ రెండు రాష్ట్ర ప్రభుత్వాలు చెల్లించకపోవడంపై సుప్రీం కోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. కరోనా కారణంగా మరణించినవారి కుటుంబానికి రూ. 50 వేలు చొప్పున పరిహారం ఇవ్వాలని గతంలో న్యాయస్థానం ఆదేశించింది.
అయితే ఈ చెల్లింపుల విషయంలో ఆంధ్రప్రదేశ్, బీహార్తో పాటు మరికొన్ని రాష్ట్రాలు నిర్లక్ష్యం వహించాయి. దీనిపై దాఖలైన పిటిషన్పై బుధవారం సుప్రీంకోర్టు విచారణ జరిపింది. ఏపీ, బీహార్ రాష్ట్రాలకు చెందిన ప్రధాన కార్యదర్శులు కోర్టు ముందు హాజరుకావాలని, పరిహారం ఎందుకు ఇవ్వలేదో తెలియజేయాలని ధర్మాసనం ఆదేశించింది.