హైదరాబాద్, నవంబర్ 3 (నమస్తే తెలంగాణ): ఏపీ సీఎం జగన్ అక్రమాస్తుల కేసులపై వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టులో శుక్రవారం విచారణ జరిగింది. సీబీఐకి నోటీసులు జారీ చేసిన సుప్రీంకోర్టు కేసుల విచారణ ఎందుకు ఆలస్యమవుతున్నదీ చెప్పాలని ప్రశ్నించింది.
రఘురామ వేసిన కేసుల బదిలీ పిటిషన్ను ఎందుకు విచారించకూడదో చెప్పాలని ఆదేశించింది. ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. జగన్, ఎంపీ విజయసాయిరెడ్డి సహా ప్రతివాదులకు నోటీసులను సుప్రీం కోర్టు జారీ చేసింది. తదుపరి విచారణను జనవరికి వాయిదా వేసింది.