హైదరాబాద్: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ విభజన వివాదాల పరిష్కార ఉపసంఘం భేటీ అయింది. ఇరు రాష్ట్రాల మధ్య అపరిష్కృతంగా ఉన్న విభజన వివాదాల పరిష్కారానికి కేంద్ర హోంశాఖ జాయింట్ సెక్రెటరీ నేతృత్వంలో ఉపసంఘం ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగా ఇరు రాష్ట్రాల అధికారులతో ఉపసంఘం వర్చువల్గా సమావేశమయింది. ఈ సమావేశానికి తెలంగాణ నుంచి ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ఏపీ నుంచి ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి ఎస్ఎస్ రావత్ హాజరయ్యారు.
ఈ సందర్భంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య విభజన వివాదాలపై చర్చిస్తున్నారు. ప్రధానంగా ఐదు అంశాలు ఈ సమావేశంలో చర్చకు రానున్నాయి. ఏపీ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ విభజన, సివిల్ సప్లయ్ ఆర్థిక అంశాలు, పన్నుల విధానం, బ్యాంకు డిపాజిట్లు, నగదు పంపకాలపై చర్చ జరగనుంది.