అమరావతి : వైకుంఠ ఏకాదశి సందర్భంగా శ్రీవారి ఆలయాన్ని శుద్ధి చేయడంలో భాగంగా ఈరోజు ఉదయం 6 గంటల నుంచి 11 గంటల వరకు భక్తులకు దర్శనాలను నిలిపివేశారు . తిరుమలలోని శ్రీవారి ఆలయంలో కోయిల్ అళ్వార్ తిరుమంజనం సందర్భంగా వీఐపీ బ్రేక్ దర్శనాలను కూడా రద్దు చేశారు. ఎల్లుండి నుంచి 10 రోజుల పాటు శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనం 13 వ తేదీ నుంచి 22వ తేదీ వరకు సిఫార్సు లేఖలను అధికారులు రద్దు చేసినట్లు ఇదివరకే ప్రకటించిన విషయం తెలిసిందే.
కాగా నిన్న శ్రీవారిని 32, 242 మంది భక్తులు దర్శించుకోగా 15,715 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. కానుకల రూపేణా రూ. 2.71 కోట్లు హుండీ ఆదాయం వచ్చిందని అధికారులు వెల్లడించారు.