అమరావతి : రాష్ట్రంలో సహజ మరణాలను కూడా అడ్డం పెట్టుకుని ప్రభుత్వంపై ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని ఏపీ సీఎం జగన్ అన్నారు. జంగారెడ్డిగూడెంలో సారా మరణాలపై అసెంబ్లీ సమావేశంలో సమాదానమిచ్చారు. రాష్ట్రంలో కల్తీ మద్యం సారా లాంటి వాటిని ఉక్కుపాదంతో అణచివేస్తున్నామని ప్రకటించారు.
చంద్రబాబు హయంలో ఉన్న 43వేల బెల్టుషాపులను తాము అధికారంలోకి వచ్చిన వెంటనే తొలగించామని స్పష్టం చేశారు. అయితే కొన్ని ప్రాంతాల్లో సారా తయారీలాంటి వాటిని అరికట్టేందుకు ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేశామన్నారు. రాష్ట్రప్రభుత్వానికి చెడ్డపేరు వచ్చేలా ఎందుకు ప్రయత్నిస్తామని పేర్కొన్నారు. మద్య నియంత్రణ చేయడమే తమ లక్ష్యమని అన్నారు.