అమరావతి : ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాలో వరద ఉధృతి ఇంకా కొనసాగుతూనే ఉంది. కర్నూలులోని హోళగుంద మండలం మర్లమడికి వద్ద వేదవతి నది ఉధృతి పెరగడంతో ఏపీ-కర్నాటక మధ్య రహదారిపై అధికారులు రాకపోకలను నిలిపివేశారు. ప్రయాణికులు గంటల తరబడి రోడ్లపైనే ఉండిపోవడంతో అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. వేదవతి నది పరివాహక ప్రాంతాల్లో పంటలు నీట మునగడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
కడపలోని పాపాగ్ని నదికి భారీ వరద వచ్చి చేరుతుంది. ఈ నది ఉధృతికి కమలాపురంలో వంతెన కూలడంతో కడప- కమలాపురం మార్గంలో రాకపోకలు నిలిచిపోయాయి. నెల్లూరులోని సోమశిల నుంచి పెన్నానదికి వరద తగ్గుముఖం పట్టింది. సంగంలో ముంబై జాతీయ రహదారిపై తగ్గిన వరదతో అధికారులు రాకపోకలను పునరుద్ధరించారు.