ముంబై: ఒకప్పుడు క్రిప్టో కరెన్సీ మేజర్ బిట్కాయిన్ను ఆరాధించిన ప్రముఖ రచయిత నజీం తాలెబ్ స్వరం మారింది. ప్రస్తుతం బిట్ కాయిన్ విలువ వాస్తవంగా జీరో మాత్రమే అని తేల్చేశారు. ప్రభుత్వంతో సంబంధం లేని కరెన్సీ అన్న భావనను రుజువు చేయడంలో బిట్ కాయిన్ విఫలమైందని పేర్కొన్నారు.
స్వల్ప కాలంలో గానీ, దీర్ఘ కాలంలో గానీ బిట్ కాయిన్కు విలువ లేదన్నారు. పెరిగిపోతున్న ద్రవ్యోల్బణానికి వ్యతిరేకంగా దీన్ని నిర్వహించలేమని నజీం తాలెబ్ అని బిట్కాయిన్, కరెన్సీ అండ్ బబుల్స్ అనే పేరుతో రాసిన పరిశోధనా పత్రంలో పేర్కొన్నారు.
ప్రపంచ దేశాలపై గతేడాది కరోనా మహమ్మారి ఉధ్రుత ప్రభావం నేపథ్యంలో బిట్ కాయిన్ విలువ దూసుకెళ్లింది. ఈ ఏడాది కూడా మెరుగ్గా పుంజుకున్నది. ఏప్రిల్లో ఆల్ టైం రికార్డు 62,741 డాలర్లకు చేరుకున్నది బిట్ కాయిన్ విలువ.
టెస్లా సీఈవో ఎలన్మస్క్ యూటర్న్, చైనా నిషేధాజ్ఞల తర్వాత గత రెండు నెలల్లో బిట్ కాయిన్ విలువు 50 శాతానికి పైగా పతనమైంది. తాజాగా 30 వేల డాలర్ల దిగువకు పడిపోయింది.
ఈ నేపథ్యంలో బిట్కాయిన్ వాస్తవిక విలువపై నజీం తాలెబ్ పేర్కొన్న అభిప్రాయం గ్లోబల్ ఇన్వెస్టమెంట్ వరల్డ్లో చర్చకుదారి తీయనున్నది. భారత్లో క్రిప్టో కరెన్సీ ఔత్సాహికులు తరుచుగా బిట్ కాయిన్ అసెట్ మాత్రమేనని, కరెన్సీకాదని వాదిస్తున్నారు.