రాజమండ్రి: ఏపీలో సీఎం జగన్ పాలనతో రాష్ట్రం అధోగతి పాలయిందని జనసేన పొలిటికల్ అఫైర్ కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ఆరోపించారు. మంగళవారం రాజోలు నియోజకవర్గంలో పర్యటించి మీడియాతో మాట్లాడారు. ఏపీలో ఇసుక దోపిడీ , భూ కబ్జాలతో ప్రజాధనాన్ని దోచుకుంటున్నారని ఆరోపించారు.
రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలు, వరదలతో జనం అతలాకుతలమైతే బాధితులను ఆదుకోవడం పోయి రాజకీయాలతో పైశాచిక ఆనందం పొందుతున్నారని విమర్శించారు. రానున్న రోజుల్లో జనసేన పార్టీ స్పష్టమైన హామీలతో ప్రజల ముందుకు వస్తుందని అన్నారు. తమ పార్టీ రాష్ట్రంలో బలపడుతుందని ఆయన వెల్లడించారు.