అమరావతి : ఏపీ సీఎం జగన్ పాలనలో రాష్ట్రం అప్పుల పాలవుతుందని బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ఆరోపించారు. అన్నమయ్య జిల్లా మదనపల్లిలో ఆయన ఇవాళ పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ . కేంద్రం రూ. 15 వేల కోట్లతో ఏపీకీ ప్రత్యేక హోదా ఇస్తుందని వెల్లడించారు. గత ప్రభుత్వ హయాంలో చంద్రబాబు ఆరు ప్రాజెక్టులు కావాలని కేంద్రాన్ని అడిగారని వివరించారు.
పోలవరానికి రూ. 55 వేల కోట్లు, ఉపాధి హామీ పథకానికి రూ. 70 వేల కోట్లు కేంద్రం ఇచ్చిందని గుర్తు చేశారు. రాయలసీమ నుంచి అమరావతిని కేంద్రం కలిపేందుకు 6,4 లేన్లతో జాతీయ రహదారి నిర్మాణం చేపడుతుందని వెల్లడించారు. కడప, కర్నూల్లో ఎయిర్పోర్టు నిర్మిస్తుందన్నారు. పోలవరంతో పాటు రాయలసీమ పెండింగ్ ప్రాజెక్టులపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టిపెట్టాలని డిమాండ్ చేశారు.