తిరుమల : శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో శుక్రవారం మలయప్పస్వామివారు కల్పవృక్ష వాహనంపై దర్శనమిచ్చారు. రాజమన్నార్ రూపధారిగా ఛర్నాకోల్ చేతబట్టి ఊరేగారు. మాడ వీధుల్లో అంగరంగ వైభవం గా జరిగిన వాహనసేవలో వివిధ ప్రాంతాలకు చెందిన కళాబృందాలు ప్రదర్శనలిచ్చాయి. బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది . శ్రీవారి సర్వదర్శనానికి 29 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. వీరికి దర్శనానికి 8 గంటల సమయం పడుతుందని టీటీడీ అధికారులు తెలిపారు.
నిన్న శ్రీవారిని 61,879 మంది భక్తులు స్వామివారిని దర్శించుకోగా 24,631 మంది తలనీలాలు సమర్పించు కున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ. 1.82 కోట్లు వచ్చిందని వివరిం చారు. రేపు గరుడ సేవ సందర్భంగా ఇవాళ మధ్యాహ్నం నుంచి తిరుమల కనుమదారుల్లో బైకులకు అనుమతిని నిరాకరిస్తున్నట్లు వెల్లడించారు. అక్టోబర్ 2 మధ్యాహ్నం నుంచి ద్విచక్రవాహనాలకు అనుమతిస్తామని తెలిపారు.