హైదరాబాద్, జూన్ 27 (నమస్తే తెలంగాణ): శ్రీవారిమెట్టు సమీపంలో మంగళవారం శ్రీనివాసమంగాపురం శ్రీకల్యాణ వేంకటేశ్వరస్వామి పార్వేట ఉత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఉదయం 11 గంటలకు ఆలయం నుంచి మొదలైన ఉత్సవమూర్తుల ఊరేగింపు.. శ్రీవారిమెట్టు సమీపంలోని పార్వేట మండపానికి చేరుకున్నది.
అకడ క్షేమతలిగ నివేదన చేసి పార్వేట ఉత్సవం నిర్వహించారు. ఆస్థానం అనంతరం సాయంత్రానికి స్వామివారి ఉత్సవమూర్తులను తిరిగి ఆలయానికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా కళాకారులు భక్తి సంకీర్తనలు ఆలపించారు.