తిరుమల : తిరుమలలోని శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి భక్తులు పెద్ద ఎత్తున తిరుమలకు
చేరుకుంటున్నారు. నిన్న శ్రీవారిని 70,727 మంది భక్తులు దర్శించుకోగా 38,970 మంది తలనీలాలు
సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించిన కానుకల ద్వారా హుండా ఆదాయం రూ. 3.88 కోట్లు
వచ్చిందని టీటీడీ అధికారులు తెలిపారు.
భక్తుల అధిక రద్దీ కారణంగా బుధవారం నాటి సర్వదర్శనం టోకెన్లు ఒక రోజు ముందు అనగా మంగళవారం మధ్యాహ్నం నుంచి తిరుపతిలోని ఆయా కౌంటర్లలో కేటాయించడం జరుగుతుందని వెల్లడించారు. ఆది, సోమవారాల్లో దర్శన టోకెన్లు కేటాయించడం లేదని, భక్తులు ఈ విషయాన్ని గమనించి తదనుగుణంగా తిరుమల యాత్ర ప్రణాళిక రూపొందించుకోవాలని అధికారులు సూచించారు.