తిరుమల : తిరుమల తిరుపతి దేవస్థానానికి శుక్రవారం రూ. 2. 75 కోట్లు హుండీ ఆదాయం వచ్చిందని టీటీడీ అధికారులు వెల్లడించారు. నిన్న ఒక్కరోజే 29, 692 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోగా 14,916 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారని వివరించారు.
ఈ నెల 11న శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం సందర్భంగా వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేసినట్లు అధికారులు వెల్లడించారు. సంక్రాంతి పండుగ సందర్భంగా ఈనెల 11 నుంచి 14 వ తేదీ వరకు తిరుమల పరిధిలోని వసతి గదుల అడ్వాన్స్ రిజర్వేషన్ను కూడా రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఈనెల 13 నుంచి 22 వ తేదీ వరకు వీఐపీ బ్రేక్ దర్శనాల సిఫార్సు లేఖలను సైతం రద్దు చేస్తున్నట్లు పేర్కొన్నారు.