అమరావతి : తిరుమలలోని శ్రీవారిని నిన్న 39,440 మంది భక్తులు దర్శించుకున్నారు. 13,692 మంది తలనీలాలు సమర్పించుకున్నారని టీటీడీ అధికారులు వెల్లడించారు. భక్తులు సమర్పించిన కానుకల రూపేణా శ్రీవారి హుండీకి రూ . 2.53 కోట్లు ఆదాయం వచ్చిందని వివరించారు. గత నాలుగు రోజులుగా భక్తులు శ్రీవారి దర్శించుకున్న వారి సంఖ్యను పరిశీలించినట్లయితే రోజురోజుకు పెరుగుతుంది . ఈనెల 18న 33,971 మంది భక్తులు దర్శించుకోగా 19న 34, 187 మంది , 20న 36,092 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు.