తిరుమల : తిరుమలలోని శ్రీవారిని నిన్న 31,167 మంది భక్తులు దర్శించుకున్నారు. 15,701 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారని టీటీడీ అధికారులు వెల్లడించారు. భక్తులు సమర్పించిన కానుకల వల్ల రూ. 1.83 కోట్లు హుండీ ఆదాయం వచ్చిందని తెలిపారు. కొవిడ్ నిబంధనల ప్రకారం భక్తులకు దర్శనం అవకాశం కల్పిస్తున్నామని వివరించారు. భక్తులు తప్పనిసరిగా మాస్కులు ధరించాలని, భౌతికదూరం పాటించాలని కోరారు.