తిరుమల : తిరుమలలోని శ్రీవారిని నిన్న 26,401 మంది భక్తులు దర్శించుకున్నారు. 12,401 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారని టీటీడీ అధికారులు వెల్లడించారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ.2.18 కోట్లు వచ్చిందని పేర్కొన్నారు.