Srisailam : ప్రసిద్ధ శైవ క్షేత్రమైన శ్రీశైలంలో మూలా నక్షత్రాన్ని పురస్కరించుకొని ఈరోజు సాయంత్రం స్వామి, అమ్మవార్లకు ఊయల సేవ నిర్వహించనున్నారు. లక్ష కుంకమార్చన తర్వాత ఊయల సేవ జరగనుంది. అంతకంటే ముందుగా లోక కల్యాణాన్ని కోరుకుంటూ అర్చకులు సేవా సంకల్పాన్ని పఠిస్తారు. ఊయల సేవ కార్యక్రమం ఏ ఆటంకం లేకుండా జరగాలని మహాగణపతి పూజ చేస్తారు. అనంతరం స్వామి, అమ్మవార్లకు శాస్త్రోక్తంగా షోడశోపచార పూజ నిర్వహించాక ఊయల సేవ ప్రారంభిస్తారు.
ఈ సందర్భంగా స్వామి అమ్మవార్లకు పలు రకాల పూలతో అలంకరణ చేయడమే కాకుండా పుష్పార్చణ చేస్తారు. ఊయల సేవను మూలా నక్షత్రం కనిపించిన రోజుతో పాటు ప్రతి పౌర్ణమి, శుక్రవారం రోజున జరుపుతారు.