Srisailam | శ్రీశైల మహా క్షేత్రంలో అత్యంత వైభవంగా జరిగిన కార్తీక మాసోత్సవాల్లో శ్రీభ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లకు వివిధ రూపాల్లో భక్తులు మొక్కుల ద్వారా రూ. 30 కోట్ల పై చిలుకు రాబడి వచ్చిందని ఆలయ అధికారులు తెలిపారు. కార్తీకమాసం ముగిసిన తరువాత ఉభయ దేవాలయాలతోపాటు పరివార దేవతాలయాల హుండీల నుంచి రూ.6,73,79,922, సాధారణ డిపాజిట్ల రూపంలో రూ.19,95,73,883 , ఆన్లైన్ సేవా టిక్కెట్లు విరాళాల ద్వారా రూ.3,25,68,719, అన్నదాన పథకం కోసం రూ.94,04,979 విరాళాలు వచ్చాయి.
ఇంకా నూతన ఆర్జిత సేవలైన ఉదయాస్తమాన సేవకు రూ.8,08,928, ప్రదోష కాలసేవకు రూ.22,35,324, అభిషేకాల ద్వారా రూ.2,20,56,210, కుంకుమార్చనల ద్వారా రూ.62,88,712, ఆర్జితసేవా కౌంటర్ల ద్వారా రూ.94,42,942, దర్శనం టిక్కెట్ల ద్వారా రూ. 6,32,69,771తోపాటు లడ్డూ పులిహోర ప్రసాదాల విక్రయాల ద్వారా రూ.4,96,18,620, వసతి సదుపాయాల ద్వారా రూ. 92,30,831 ఆదాయం లభించింది.
టోల్గేట్ ద్వారా రూ.87,26,350, ప్రచురణల ద్వారా రూ. 37,84,911, కైలాస కంకణాల ద్వారా రూ.12,69,295, విభూతితో రూ.11,57,840, తులాభారం నుండి రూ.17,20,302, కేశఖండన వల్ల రూ.20,23,650 నిధులు సమకూరాయి. ఇక పరోక్షసేవలు, ఈ హుండీ, అన్నప్రసాద ట్రస్ట్, గో సంరక్షణ ట్రస్ట్, ఆగమ పాఠశాల ట్రస్ట్, అడ్వాన్స్ టికెట్ అండ్ అకామిడేషన్ బుకింగ్ల ద్వారా రూ.3,25,68,719 నిధులు వచ్చాయి. మొత్తం దేవాలయానికి రూ.30,89,27,503 రాబడి వచ్చిందని అధికారులు తెలిపారు.
శ్రీశైల దేవస్థానంతోపాటు క్షేత్రాభివృద్దికి కానుకలు మెక్కుల రూపంలో ముడుపులు చెల్లించిన భక్తులకు దాతలకు ఈవో లవన్న కృతఙ్ఞతలు తెలిపారు. వివిధ ప్రాంతాల నుండి వచ్చే భక్తులు స్వామి అమ్మవార్ల కైంకర్యాల నిర్వాహణకు, యాత్రికుల వసతుల కల్పనకు ముందుకు వస్తున్న దాతల సహకారం వల్లే ఆలయ అభివృద్ది సాధ్యమవుతుందని అన్నారు. గత సంవత్సరంతో పోల్చితే దాదాపుగా రెట్టింపు స్థాయిలో దేవస్థానానికి రాబడి వచ్చిందని తెలిపారు.