శ్రీశైలం: శ్రీశైల శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామిఅమ్మవార్ల క్షేత్రంలో లోకకళ్యాణాన్ని కాంక్షిస్తూ పరివార దేవతలకు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహిస్తున్నట్లు ఈవో లవన్న తెలిపారు. మంగళవారం ఉదయం కుమారస్వామికి ఈవో అభిషేకాలు, ప్రత్యేక పూజలు చేశారు. అదే విధంగా సాయంత్రం ప్రదోషకాలంలో క్షేత్రపాలకుడైన బయలు వీరభద్రస్వామికి పంచామృతాభిషేకాలు, పుష్పార్చనలు జరిపించి భక్తులకు తీర్థప్రసాదాలు ఇచ్చారు.
ప్రధాన ఆలయంలో నందిమండపంలో కొలువైన శనగల బసవన్నను శుద్దోదకాలు, ఫలోదకాలతో అభిషేకించి షోడశోపచార పూజలు వైభవంగా చేశారు. నందీశ్వరునికి శనగలు నైవేద్యంగా సమర్పించి వర్షాలు సకాలంలో కురిసి రైతాంగం సుభిక్షంగా ఉండాలని వేడుకున్నారు.