భూ కైలాస క్షేత్రం శ్రీశైల మల్లన్నకు భక్తులు మొక్కుబడిగా చెల్లించిన హుండీని బుధవారం లెక్కించారు.
28 రోజుల ఆదాయాన్ని లెక్కించినట్లు అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. నగదు రూపంలో రూ. 3 కోట్ల 69 లక్షల 67 వేలు హుండీలో లభించాయని వెల్లడించారు. అలాగే, 333. 300 గ్రాంల బంగారు,
6 కేజీల 710 గ్రాంల వెండి లభించినట్లు తెలిపారు.
వీటితోపాటు 2,083 డాలర్ల యూఎస్ డాలర్లు, 195 యూఏఈ దిర్హమ్స్, ఐదు మలేషియా రింగిట్స్, 75 ఇంగ్లాండ్ పౌండ్స్, 80 ఆస్ట్రేలియా డాలర్లను భక్తులు సమర్పించినట్లు అధికారులు పేర్కొన్నారు. పటిష్టమైన భద్రతా ఏర్పాట్ల నడుమ సీసీ కెమెరాల నిఘాలో ఈ హుండీ లెక్కింపు నిర్వహించినట్లు వెల్లడించారు. ఈ హుండీ లెక్కింపులో దేవస్థాన అన్ని విభాగాల అధికారులు, సిబ్బంది, శివసేవకులు పాల్గొన్నారు.