అమరావతి: శ్రీశైలం జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టంతో కళకళలాడుతుంది. జలాశయం నుంచి రెండు గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. జూరాల, సుంకేశుల నుంచి శ్రీశైలానికి 1,08,694 క్యూసెక్కుల ప్రవాహం కొనసాగుతుండగా జలాశయం పూర్తి నీటి మట్టం 885 అడుగుల వరకు చేరుకుంది. ప్రాజెక్టు పూర్తి నీటి నిల్వ 215.80 టీఎంసీలు. కుడి, ఎడమ జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తిని కొనసాగిస్తున్నారు. విద్యుదుత్పత్తి ద్వారా 63,792 క్యూసెక్కుల నీటిని నాగార్జున సాగర్కు విడుదల చేస్తున్నారు.