అమరావతి: శ్రీశైలం ప్రాజెక్టుకు ఎగువ ప్రాంతానికి భారీగా వరద నీరు వచ్చి చేరుతుండడంతో ఏపీ నీటి పారుదలశాఖ అధికారులు ప్రాజెక్టు 10 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. స్పిల్వే ద్వారా 2.77 లక్షల క్యూసెక్కుల నీటిని సాగర్కు విడుదల చేస్తున్నారు. జూరాల, సుంకేశుల నుంచి శ్రీశైలానికి 3.64 లక్షల క్యూసెక్కుల ప్రవాహం వస్తుందని అధికారులు వివరించారు.
శ్రీశైలం జలాశయం నీటిమట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం నీటిమట్టం 884.30 అడుగులుగా ఉంది. జలాశయం నీటి మట్టం 215.80 టీఎంసీలకు గాను 211.47 టీఎంసీల వరకు నీరు నిల్వ ఉంది. శ్రీశైలం కుడి, ఎడమ జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్పత్తిని కొనసాగిస్తున్నట్లు వెల్లడించారు.