Srisailam | శ్రీశైల భ్రమరాంబికా మల్లిఖార్జున స్వామి అమ్మవార్ల దేవాలయానికి రూ.4,03,29,226 కోట్ల ఆదాయం లభించింది. దేవాలయ హుండీలో వచ్చిన విరాళాలను శుక్రవారం లెక్కించారు. ఆలయ ప్రాంగణంలోని అక్కమహాదేవి అలంకార మండపంలో పటిష్ఠ నిఘా నేత్రాల మధ్య ఆలయ సిబ్బందితోపాటు శివసేవకులు ఉభయ దేవాలయాలు, పరివార దేవతాలయాల హుండీలను లెక్కించారు. గత 27 రోజులుగా స్వామి అమ్మవార్లకు భక్తులు చెల్లించిన మొక్కులు, కానుకలు నగదు రూపంలో 4,03,29,226 కోట్ల ఆదాయం వచ్చినట్లు ఈవో లవన్న తెలిపారు.
వీటితోపాటు 521.700 గ్రాముల బంగారం, 6.130 కిలోల వెండి ఆభరణాలు, 3740 అమెరికా డాలర్లు, 10 కువైట్ డాలర్లు, 70 ఆస్ట్రేలియా డాలర్లు, 15 యూఏఈ ధీర్హమ్స్, 30 సింగపూర్ డాలర్లు, 15 మలేషియా రింగెట్స్, 60 యూరోల కరెన్సీని స్వామి అమ్మవార్లకు మొక్కులుగా హుండీలో భక్తులు సమర్పించినట్లు ఆలయ అధికారులు తెలిపారు. హూండీ లెక్కింపులో ఈవోతో పాటు అన్ని విభాగాల అధికారులు పాల్గొన్నారు.