Srisailam | భారతీయ సనాతన హిందూ ధర్మ ఆచార సంప్రదాయాలు ఎంతో విలువైనవని శ్రీశైలం దేవస్థానం ఈఓ పెద్దిరాజు పేర్కొన్నారు. ఈ సంప్రదాయాలను చిన్నారులకు పసితనం నుండే అలవాటు చేయాలని సూచించారు. ఆదివారం భోగిపండుగ సందర్బంగా ఆలయ ప్రాకారంలోని అక్కమహాదేవి అలంకార మండపంలో ఐదేండ్ల లోపు గల చిన్నారులకు భోగిపండ్ల కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.
శ్రీభ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్ల ఆశిస్సుతో చిన్నారులకు బంగారు భవిష్యత్ కలుగాలని కాంక్షిస్తూ అర్చక వేద పండితులు మహా సంకల్పం పఠించారు. భోగి పండుగ నాడు రేగు, చెరకు పండ్లను పసిపిల్లల తలపై పోయడంతో బ్రహ్మరంధ్రం ప్రేరేపింపబడి ఙ్ఞానవంతులవుతారని దేవస్థానం ప్రధాన అర్చకులు మార్కండేయ శర్మ, వీరన్న స్వాములు తెలిపారు. పిల్లలకు దృష్టి లొపాలు చీడపీడలు తొలగిపోయి ఆయురారోగ్యాలు ప్రాప్తిస్తాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సుమారు 100 మందికిపైగా చిన్నారులు పాల్గొన్నారు.