హైదరాబాద్ : శ్రీశైలం ( Srisailam )ఆలయానికి వచ్చే భక్తులకు రుచికరమైన భోజనాన్ని అందించాలని శ్రీశైలం ఆలయ ఈవో లవన్న సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం ఆలయంలోని లడ్డు, ప్రసాద విక్రయ కేంద్రాలతో పాటు అన్న ప్రసాద వితరణను ఆయన తనిఖీ(Visit) చేశారు. లడ్డు ప్రసాదాల విక్రయ కేంద్రాలలో స్టాకు నమోదు, లడ్డు ప్రసాదాల టికెట్ల జారీ విధానాన్ని ఆయన పరిశీలించారు. భక్తులు అధిక సమయం క్యూలైన్లలో ఉండకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
అనంతరం ఆయన అన్నదాన భవనంలోని వంటశాల, అన్నదానం స్టోర్లను పరిశీలించి స్టోరులో స్టాకు రిజిస్టరు (Stock Register)ను పరిశీలించారు. కూరగాయలు తాజగా ఉండేవిధంగా జాగ్రత్తలు తీసుకోవాలని , వంటకాలన్నీ రుచికరంగా ఉండేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. అన్నప్రసాద వితరణ సజావుగా జరిగేవిధంగా ప్రతి హాలును నిరంతరం పర్యవేక్షిస్తుండాలని వివరించారు. శుచీ, శుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని సిబ్బందిని ఆదేశించారు. ఈ సందర్భంగా భక్తులతో మాట్లాడి అభిప్రాయాలను తీసుకున్నారు.