Srisailam Trust Board | ఆంధ్రప్రదేశ్లోని కర్నూల్ జిల్లా పరిధిలో గల శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవస్థానం ట్రస్ట్ బోర్డు సభ్యుల ప్రమాణ స్వీకారం శుక్రవారం జరుగున్నది. శుక్రవారం తెల్లవారుజామున ఐదు గంటలకు దేవస్థాన కార్యాలయంలో ట్రస్ట్ బోర్డు సభ్యుల ప్రమాణ స్వీకారం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి సభ్యులంతా హాజరై ప్రమాణం చేయాలని దేవస్థానం ఈవో కోరారు.
ఆలయ చైర్మన్గా చిత్తూరు జిల్లాకు చెందిన రెడ్డివారి చక్రపాణి రెడ్డి పేరును ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఖరారు చేసింది. ఇప్పటికే రెండు సార్లు దేవస్థానం ట్రస్ట్ బోర్డు సభ్యుల ప్రమాణ స్వీకారం వాయిదా పడింది.
ట్రస్ట్ బోర్డులో ఐదుగురు బీసీలు, ఆరుగురు ఓసీలు, ఒక ఎస్టీ సభ్యుడిని రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. వీరు ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచి రెండేండ్ల పాటు పదవిలో ఉంటారు.