Srisailam | ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీశైల శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామిఅమ్మవార్లను శ్రీశైల జగద్గురు పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ చెన్న సిద్దరామ శివాచార్య మహాస్వామి దర్మించుకున్నారు. మంగళవారం ఉదయం ఆలయానికి వచ్చిన ఆయనకు ఈవో పెద్దిరాజు బిల్వమాలతో, అర్చక వేదపండితులచే పూర్ణకుంభ స్వాగతం పలికారు. ఉభయ దేవాలయాల్లో స్వామిఅమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేసుకుని తీర్థప్రసాదాలు తీసుకున్నారు.