AP News | శ్రీకాళహస్తి : శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి పీఏ(పర్సనల్ అసిస్టెంట్) ఆత్మహత్య చేసుకున్నాడు. హౌసింగ్ బోర్డు కాలనీలోని నివాసముండే పీఏ రవి.. తన ఇంట్లోనే ఫ్యాన్కు ఉరేసుకున్నాడు. ఫ్యాన్కు వేలాడుతున్న రవిని చూసి కుటుంబ సభ్యులు షాక్ అయ్యారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు రవి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.
గత నాలుగేండ్ల నుంచి ఎమ్మెల్యే వద్ద రవి పీఏగా పని చేస్తున్నట్లు అతని కుటుంబ సభ్యులు తెలిపారు. ఎమ్మెల్యే తరపున వచ్చే వీఐపీలకు తిరుమలలో దర్శన ఏర్పాట్లు పర్యవేక్షించేవాడు. అయితే ఉన్నట్టుండి రవి సూసైడ్ చేసుకోవడంతో విషాదఛాయలు అలుముకున్నాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అప్పుల బాధలే ఆత్మహత్యకు కారణాలుగా పోలీసులు అనుమానిస్తున్నారు.