తిరుమల: కలియుగ ప్రత్యక్షదైవం తిరుమల శ్రీవారికి సోమవారం సాయంత్రం పెదశేషవాహన (Pedda sesha vahanam) సేవ నిర్వహించనున్నారు. నాగుల చవితి సందర్భంగా పెదశేష వాహనంపై ఉభయ దేవేరులతో కలిసి మలయప్పస్వామి దర్శనమిస్తారు. నేడు కపిలేశ్వరాలయంలో విశేషపూజ, హోమ మహోత్సవాలు నిర్వహిస్తారు.
తిరుమలలో ఈ నెల 14న దక్షిణాది రాష్ట్రాల సీఎంల భేటీ జరగనుంది. ఈ నేపథ్యంలో నవంబర్ 13, 14, 15 తేదీల్లో వీఐపీ బ్రేక్ దర్శనాలను తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) రద్దు చేసింది. 12, 13, 14 తేదీల్లో సిఫార్సు లేఖలు స్వీకరించేది లేదని స్పష్టం చేసింది. సీఎంల భేటీ దృష్ట్యా దాతలకు గదులు కేటాయింపు నిలిపివేసింది.