తిరుమల : తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయానికి ఏడున్నర మైళ్ల దూరములో ఉన్న ప్రముఖ పుణ్యతీర్థం శ్రీ తుంబురు తీర్థ ముక్కోటి ఉత్సవాన్ని మార్చి 18న వైభవంగా నిర్వహించేందుకు టీటీడీ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నా. కొవిడ్ కారణంగా రెండు సంవత్సరాల తరువాత ఈ పుణ్యతీర్థానికి భక్తులను అనుమతించనున్నారు.
పురాణప్రాశస్త్యం ప్రకారం తిరుమలలోని శేషగిరులలో 3 కోట్ల 50 లక్షల పుణ్యతీర్థాలు ఉన్నయని కథనం . వీటిలో ప్రధానమైనవి ఏడు తీర్థాలల్లో స్వామివారి పుష్కరిణి, కుమారధార, తుంబురు, రామకృష్ణ, ఆకాశగంగ, పాపవినాశనం, పాండవ తీర్థముని అధికారులు తెలిపారు. పాల్గుణమాసమున ఉత్తరఫల్గుణీ నక్షత్రముతో కూడిన పౌర్ణమినాడు తుంబురు తీర్థ ముక్కోటి నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందని తెలిపారు. ఈ పర్వదినాన తీర్థస్నానమాచరించి, దానధర్మాలు చేసి స్వామివారిని భక్తులు దర్శించుకుంటారు.