అమరావతి : దక్షిణ మధ్య రైల్వే ప్రయాణీకుల రద్దీని తగ్గించడానికి సిద్ధమైంది. విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్ మధ్య మరికొన్ని వీక్లీ స్పెషల్ ట్రైన్స్ ను పెంచనున్నది.ట్రైన్ నెంబర్ 08579 విశాఖపట్నం-సికింద్రాబాద్ ప్రతి బుధవారం నడుస్తుంది. ప్రయాణ తేదీ జనవరి 5-26నుంచి అమలులోకి వస్తుంది. ట్రైన్ నెంబర్ 08579 సికింద్రాబాద్-విశాఖపట్నం రైలు ప్రతి గురువారం నడుస్తుంది. ప్రయాణ తేదీ జనవరి 6-27 నుంచి అమలులోకి వస్తుంది.
ట్రైన్ నెంబర్ 08585 విశాఖపట్నం-సికింద్రాబాద్ ప్రత్యేక రైలు ప్రతి మంగళవారం నడుస్తుంది. ప్రయాణ తేదీ జనవరి 4-25 నుంచి అమలులోకి వస్తుంది. ట్రైన్ నెంబర్ 08586) సికింద్రాబాద్-విశాఖపట్నం రైలు ప్రతి బుధవారం నడుస్తుంది. ప్రయాణ తేదీ జనవరి 5-26 నుంచి అమలులోకి వస్తుంది.