తిరుమల : ఏపీలోని 26 జిల్లా కేంద్రాల్లో ఆగస్టు 7వ తేదీన నిర్వహించనున్న 7వ విడత కల్యాణమస్తు ఉచిత సామూహిక వివాహాల కోసం ముద్రించిన ముహూర్త పత్రికకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. టీటీడీ ఆధ్వర్యంలో ముద్రించిన పత్రికలను ముందుగా శ్రీ బేడి ఆంజనేయస్వామివారి ఆలయంలో పూజలు చేసి అక్కడి నుంచి మంగళవాయిద్యాల నడుమ ఊరేగింపుగా శ్రీవారి ఆలయం వద్దకు చేరుకుని శ్రీవారి పాదాల వద్ద ఉంచి పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా టీటీడీ ఈవో ఎవి.ధర్మారెడ్డి మాట్లాడుతూ కల్యాణమస్తులో వివాహం చేసుకునే జంటలు జులై 1వ తేదీ నుంచి తమ పేర్లను నమోదు చేసుకోవాలని తెలిపారు. అన్ని జిల్లాల్లో సూచించిన ప్రాంతాల్లో తమ పేర్లను నమోదు చేసుకోవాల్సి ఉంటుందని వెల్లడించారు. జిల్లా కేంద్రాల్లో ఎంపిక చేసిన ప్రాంతంలో కల్యాణమస్తు కార్యక్రమం నిర్వహిస్తామని, ఇందుకోసం పెళ్లిదుస్తులు, పుస్తెలు, మెట్టెలు అందించి పెళ్లి భోజనం నిర్వహిస్తామని ఆయన తెలిపారు. పదేళ్ల తరువాత కల్యాణమస్తు కార్యక్రమాన్ని పునఃప్రారంభించా మని వివరించారు.
మొదట ఆంధ్రప్రదేశ్లో నిర్వహించి ఆ తరువాత ఇతర రాష్ట్రాల్లో చేపడతామని ఈవో చెప్పారు. అనంతరం ముహూర్త పత్రికను సిద్ధం చేసిన టీటీడీ ఆగమ సలహాదారు శ్రీ వేదాంతం విష్ణుభట్టాచార్యులను శ్రీవారి ఆలయంలో శాలువతో సన్మానించారు.