తిరుమల : వచ్చే నెల అక్టోబర్ నెలలో తిరుమలలో ( Tirumala ) జరిగే విశేష ఉత్సవాలను టీటీడీ (TTD )వెల్లడించింది. అక్టోబర్ 1న శ్రీవారి రథోత్సవం, 2న చక్రస్నానం, ధ్వజావరోహణం, 3న శ్రీవారి బాగ్ సవారి, 7న పౌర్ణమి గరుడ సేవను నిర్వహిస్తున్నట్లు వివరించారు.
అక్టోబర్15న తిరుమల నంబి ఉత్సవం ఆరంభం, 20న శ్రీవారి ఆలయంలో దీపావళి( Deepavali) ఆస్థానం, 23న భగినీహస్త భోజనం, 24న తిరుమలనంబి శాత్తుమొర, 25న నాగుల చవితి, పెద్ద శేష వాహనం, 27న మానవాళ మహామునుల శాత్తుమొరను వైభవంగా నిర్వహిస్తామన్నారు. 28న సెనైమొదలియార్ వర్ష తిరు నక్షత్రం, 29న తిరుమల శ్రీవారి పుష్పయాగ మహోత్సవ అంకురార్పణ, 30న తిరుమల శ్రీవారి పుఫ్పయాగం, 31న పూదత్తాళ్వార్ వర్ష తిరు నక్షత్రం, యాజ్ఞవల్క్య జయంతిని జరుపనున్నట్లు పేర్కొన్నారు.