తిరుపతి : తిరుపతిలోని శ్రీ పద్మావతి చిన్నపిల్లల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డాక్టర్ కెఎస్.జవహర్రెడ్డి అధికారులకు ఆదేశించారు . తాడేపల్లిలోని తన కార్యాలయం నుంచి టీటీడీఈవో, ఇతర ఉన్నతాధికారులతో ఆయన వర్చువల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కెఎస్.జవహర్రెడ్డి మాట్లాడుతూ చిన్నపిల్లల ఆసుపత్రి భవనాల నిర్మాణానికి నిధుల సమీకరణ, నిర్మాణపనులు వెంటనే ప్రారంభించడానికి చర్యలు తీసుకోవాలన్నారు.
పద్మావతి చిన్నపిల్లల హృదయాలయంలో ఇప్పటి వరకు 615 శస్త్రచికిత్సలు ఉచితంగా చేయడం అభినంద నీయమన్నారు. బర్డ్ ఆసుపత్రిలో స్మైల్ ట్రైన్ సంస్థ ద్వారా ఈ నెలలోనే గ్రహణమొర్రి ఆపరేషన్లు ప్రారంభిం చాలని చెప్పారు. బర్డ్లో కృత్రిమ అవయవాల తయారీ కేంద్రాన్నిఅభివృద్ధిపరచడానికి చర్యలు తీసుకోవా లని, తద్వారా దేశవ్యాప్తంగా ఎంతోమంది ఈ సేవలు ఉపయోగించుకునే అవకాశం కలుగుతుందన్నారు.
తిరుమల ఆకాశగంగ సమీపంలోని హనుమంతుని జన్మస్థలమైన అంజనాద్రి సుందరీకరణకు చర్యలు తీసుకోవాలన్నారు. తిరుమల మ్యూజియం అభివృద్ధి పనులను ఏడాదిన్నర లోగా పూర్తి చేయాలన్నారు. భారీ వర్షాలు కురిసినా ఘాట్ రోడ్లలో కొండచరియలు విరిగిపడకుండా ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు.