Special Trains | విజయవాడ వాసులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త చెప్పింది. విశాఖపట్నం – హుబ్బళ్లి మధ్య రెండు ప్రత్యేక రైళ్లను నడిపించనున్నట్లు తెలిపింది. ఉగాది పండుగ నేపథ్యంలో రద్దీని దృష్టిలో పెట్టుకొని ఈ ప్రత్యేక రైళ్లను నడిపించనున్నట్లు పేర్కొంది. విజయవాడ -హుబ్బళ్లి మధ్య ఈ నెల 10న బుధవారం అందుబాటులో ఉంటుందని పేర్కొంది. హుబ్బళ్లి -విజయవాడ మధ్య 11న గురువారం ప్రత్యేక రైలు నడుస్తుందని పేర్కొంది. విజయవాడ-హుబ్బళ్లి-విజయవాడ ప్రత్యేక రైలు ఇరుమార్గాల్లో గుంటూరు, నర్సరావుపేట, వినుకొండ, దొనకొండ, మార్కాపూర్ రోడ్, గిద్దలూర్, నద్యాల్, ఢోన్, గుంతకల్, బళ్లారి, తోరనగల్లు, హోసపెటే జంక్షన్, మునిరాబాద్, కొప్పాల్, గదగ్, అన్నిగెరి స్టేషన్లలో రైళ్లు ఆగుతాయని పేర్కొంది. రైలులో స్లీపర్, జనరల్, సెకండ్ క్లాస్ కోచ్లు ఉంటాయని పేర్కొంది.