హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్, తమిళనాడులో వర్షాలు కురుస్తుండటంతో పలు రైళ్లను రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే (SCR) ప్రకటించింది. మరికొన్ని రైళ్లను దారిమళ్లించినట్లు, ఇంకొన్ని ఆలస్యంగా నడవనున్నట్లు తెలిపింది. నేటి విశాఖపట్నం-కడప (17488) రైలు, తిరుపతి-భువనేశ్వర్, బిట్రగుండ-చెన్నై సెంట్రల్, చెన్నై సెంట్రల్-బిట్రగుంట, చెన్నై సెంట్రల్-బిలాస్పూర్, హౌరా-యశ్వంత్పూర్, హౌరా-చెన్నై సెంట్రల్, హౌరా-కన్యాకుమారి, ధన్బాద్-అలప్పుజ, ముజఫర్పూర్-యశ్వంత్పూర్ రైళ్లను రద్దు చేసినట్లు అధికారులు ప్రకటించారు. రేపటి నుంచి రైళ్లు యధావిధిగా నడుస్తాయని తెలిపారు. మరికొన్ని రైళ్లను దారిమళ్లించామని చెప్పారు.