కర్నూలు : కర్నూలు జిల్లా(Kurnool)లో దారుణం జరిగింది. పెళ్లైన రెండు వారాలకే కట్టుకున్న భార్య, అత్త, మామల పై విచక్షణరహితంగా కత్తితో దాడి చేశాడు ఓ అల్లుడు. హైదరాబాద్లోని ఓ బ్యాంకులో పనిచేస్తున్న శ్రావణ్కు భార్య రుక్మిణితో రెండు వారాల కిందట వివాహం జరిగింది. అనంతరం ఇరు కుటుంబాల మధ్య చిన్నపాటి మనస్పర్ధాలు రావడంతో శ్రావణ్ ఆవేశానికి లోనై కర్నూలు పట్టణం సుబ్బలక్ష్మీనగర్లో నివాసముంటున్న అత్తింటివారిపై మంగళవారం కత్తితో దాడి చేశాడు.
ఈ దాడిలో భార్య(Wife) రుక్మిణి , అత్త(Aunty) రమాదేవి చనిపోగా మామ తీవ్రగాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. దాడి సమయంలో అడ్డువచ్చిన మామను సైతం కత్తితో నరకడంతో ఆయనకు తీవ్ర గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలానికి వెళ్లి మృతదేహాలను స్వాధీనపరుచుకుని ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు(Police) తెలిపారు.