అమరావతి : సకాలంలో కేసు నమోదు చేయక నిర్లక్ష్యం వహించిన ఏలూరు జిల్లా పెదవేగి ఎస్ఐ సత్యనారా యణపై ఏలూరు రేంజ్ డీఐజీ సస్పెన్షన్ చేశారు. గ్రామంలో తాపీమేస్త్రీగా పనిచేస్తున్న చిట్టిబాబు అనే యువకుడు పెదవేగి గ్రామానికి చెందిన మైనర్ను ప్రేమించాడు. మాయమాటలు చెప్పి బాలికను ఏలూరు తీసుకెళ్లాగా బాలిక తల్లిదండ్రులు పోలీసు స్టేషన్లో యువకుడిపై ఫిర్యాదు చేశారు.
అయితే పోలీసులు యువకుడిపై కేసు నమోదు చేయకుండా బాలిక తల్లిని స్టేషన్కు పిలిపించి విచారిం చడంతో ఆమె మనస్తాపానికి గురై ఇంటికి వచ్చి పురుగుల మందు తాగింది. అక్కడే ఉన్న కుమార్తె సైతం పురుగుల మందు సేవించి ఆత్మహత్యకు పాల్పడ్డారు.
పోలీసుల తీరువల్లే తన భార్య, కుమార్తె ఆత్మహత్యకు పాల్పడ్డారని తండ్రి చేసిన ఆరోపణల మేరకు పోలీసు ఉన్నతాధికారులు విచారణ జరిపారు. ఇందులో ఎస్సై సత్యనారాయణ నిర్లక్ష్యం కనిపించడంతో అతడిని రేంజ్ డీఐజీ సస్పెన్షన్ చేశారు.